హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ జిమ్ సెంటర్లో బాక్సింగ్ చేస్తుండగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆయనను పలుకరించింది. ఈ సందర్బంగా ఆయన అనేక విషయాలు వెల్లడించారు. ఏపీలో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులపై మీడియా ప్రశ్నించగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ ఏం చెప్పారో వీడియో చూడండి...
ప్రశ్న: పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలపై ఎన్నో దాడులు జరిగాయి. మత మార్పిడులు కూడా జరుగుతున్నాయనే ప్రచారం ఉంది. అలాంటప్పుడు మీ బీజేపీ ఎందుకు సైలెంట్గా ఉంటోంది? మీరు కూడా కొంత హడావిడి చేసి మళ్లీ నార్మల్ అయ్యారు ఎందుకు ?
జవాబు: అక్కడ బీజేపీ, అధికారుల మెంటాలిటీ ఏ విధంగా ఉంటుందో తనకు తెలియదని ఇవాళ తనకొక వీడియో వచ్చిందన్నారు.